NewsInn

News in a Click

నిఫాతో ప‌శ్చిమ బంగాల్ లో క‌ల‌క‌లం

రోజు రోజుకు పెరుగుతున్న కేసులు

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్‌)

దేశంలోని కేర‌ళ‌లో వెలుగు చూసే నిఫా వైర‌స్ కేసులు ఈ సారి అనూహ్యంగా ప‌శ్చిమ బంగాల్ లో న‌మోదు అవుతున్నాయి. ఈ వ్యాధి సోకితే ప్ర‌ణాంత‌కం కావ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోల‌న కూడా పెరుగుతోంది. రోజు రోజుకు వ్యాధి సోకుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ప్ర‌భుత్వం అన్ని ర‌కాల ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఈ వ్యాధి సాధార‌ణంగా జంతువుల నుంచి మ‌నుసుల‌కు సోకుతుంది. వ్యాధి తీవ్ర‌త పెర‌గ‌క ముందే గుర్తిస్తే త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో వైద్యం చేసే అవ‌కాశం ఉంటుంది. కానీ వ్యాధి తీవ్రత పెరిగితే నిఫా వైర‌స్ సోకిన వారిలో 40 నుంచి 75 శాతం వర‌కు మ‌ర‌ణాలు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ వ్యాధికి ప్ర‌త్యేకంగా చికిత్స లేక‌పోవ‌డం మ‌రింత ఆందోళ‌న రేపుతోంది. జంతువుల నుంచి సోకుతున్న ఈ వ్యాధి అంటు వ్యాధి కావ‌డంతో ప్ర‌జ‌ల్లో కూడా ఆందోళ‌న మొద‌లౌతోంది. గ‌త నెల‌లో తొలి నిఫా కేసును గుర్తించిన ప్ర‌భుత్వం ఆ వెంట‌నే అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తోంది. అయినా కేసుల పెరుగుద‌ల వ‌రుస‌గా న‌మోదౌతుండ‌డంతో గ‌త నెల‌లో ఐదుగురికి నిఫా వైర‌స్ సోకిన‌ట్లు వైద్యాధికారులు గుర్తించారు. వీరు దాదాపు 110 మందిని క‌లిసిన‌ట్లు గుర్తించ‌డంతో వారంద‌రినీ క్వారంటైన్ చేశారు. వ్యాధి సోకిన వారిలో ఒక్కరిద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.

నిఫా ఎఫెక్ట్…..

నిఫా వైర‌స్ ప్ర‌భావంతో అప్ర‌మ‌త్త‌మ‌వ‌తుతున్న ఆసియా దేశాలు విమానాశ్ర‌యాల్లో స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు మొద‌లు పెట్టాయి. కోల్ క‌త్త లేదా ప‌శ్చిమ బంగాల్ నుంచి ప్ర‌యాణిల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించి వైద్య ప‌రీక్ష‌లు ఏయిర్ పోర్టులోనే ప‌లు దేశాలు ప‌రీక్ష‌లు చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *