-ఫైనల్స్ లో వైభవ్ సూర్యవంశీ ప్రతాపం
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ ఇన్)
భారత జట్టు మరోసారి అండర్-19 క్రికెట్ ప్రపంచ ఛాంపియన్ గా మరోసారి నిలిచింది. ఆరోసారి భారత క్రికెట్ జట్టు ఈ కప్ విజేతగా ఆవిర్బవించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత క్రీడాకారులు అన్ని విభాగాల్లో రాణించి ఇంగ్లాండ్ జట్టుపై పూర్తి ఆధిపత్యం చూపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఇంగ్లాడ్ జట్టు ముందు ఊహించని విదంగా టార్గెట్ విధించింది.నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 411 పరుగుల భారీ ల స్కోరు సాధించింది.

భారత ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు భారీ భాగస్వామ్యం అందిచలేక పోయారు. 4 ఓవర్లలో 20 పరుగలకే అరోన్ జార్జ్ వికెట్ భారత్ కోల్పోయింది. ఆ తరువాత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయూష్ మాత్రే భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వైభవ్ ఆకాషమే హద్దుగా చెలరేగిపోయాడు 80 బంతుల్లో 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ పరుగుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండడం విశేషం. 175 పరుగుల్లో 150 పరుగులు ఫోర్లు, సిక్స్ ల రూపంలోనే సాధించారు. 19 ఓవర్లకు భారత స్కోరు 162 పరుగులు చేరుకున్న సమయంలో అయూష్ మాత్రే 53 పరుగులు చేసి వెనుదిరిగారు.

25.3 ఓవర్ల వరకు భారత స్కోరు 251 పరుగులకు చేరుకుంది ఈ సమయంలోనే వైభవ్ సూర్యవంశీ మెన్ని లామ్స్ డెన్ బౌలింగ్ లో థామస్ రీ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. సగం ఓవర్లకే భారీ స్కోరు దిశగా భారత్ చేరుకుకోవడంతో ఆ తరువాత వచ్చిన బాట్స్ మెన్లు ఏత్రం వత్తిడి లేకుండా స్కోరును ముందుకు తీసుకెళ్లారు. వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా , అభిగ్యాజ్ కుందు,కనిష్క్ చౌహాన్ లు రాణించి భారత జట్టు స్కోరు ను 411 పరుగుల వరకు తీసుకెళ్లారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జామిస్ మింటో 3 వికెట్లు సాధించగా అలెక్స్ గ్రీన్, మోర్గాన్ లు తలా రెండు వికెట్లు తీశారు
అనంతరం భారీ స్కోరు లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 311 పరుగులకు అలౌట్ అయింది. ఇంగ్లాండ్ ఓపెనింగ్ భాగస్వామ్యంలోనే తడబడింది 19 పరుగులకే తొలివికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ బెన్ డకస్ 56 బంతులో 66 పరుగులు సాధించాఉ. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో ఫాల్కనర్ ఆడినంత సేపు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.ఫాల్కనర్ కూడా భారత బౌలర్లపై విరుచుకు పడ్డారు. 67 బంతుల్లో 115 పరుగులు సాధించి కనిష్క చౌహాన్ బౌలింగ్ లో కిల్హాన్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో ఇంగ్లాండ్ జట్టు భారత స్కోరును ఛేదించే విధంగా ఏ దశలోనూ కనిపించలేదు.

174 పరుగుల నుంచి వరుసగా వికెట్లు కోల్పోయి 311 పరుగులు స్కోరు సాధించి 40.2 ఓవర్లలోనే అలౌట్ అయింది. భారత బౌలర్లలో అంబరీష్ 3 వికెట్లు తీసుకోగా దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు.వైభవ్ విధ్వంస బ్యాటింగ్ తో భారత్ విజయం సులువైంది.







Leave a Reply