NewsInn

News in a Click

భార‌త్ ను వెంటాడుతున్న ఆందోళ‌న‌

భార‌త్ ను వెంటాడుతున్న ఆందోళ‌న‌

ఓపెనింగ్ లో కొన‌సాగుతున్న త‌డ‌బాటు

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

టీ-20 ప్ర‌పంచ క‌ప్ లో ఇండియా లీగ్ ద‌శ‌ల‌ను సులువ‌గానే అధిగ‌మించి సూప‌ర్ 8 జ‌ట్ల‌లో స్థానం పొందినా….. జ‌ట్టు ఆట తీరుపై ఇంకా పూర్తి స్థాయిలో న‌మ్మ‌కం ఎవ‌రికీ కుద‌ర‌డం లేదు. గ‌తంలో జ‌రిగిన టీ-20 మ్యాచ్ ల‌లో రాణించిన ఆట‌గాళ్లు ప్ర‌పంచ్ క‌ప్ ప్రారంభం నుంచి స‌త‌మ‌త‌వుతున్నారు. దీంతో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ల‌లో జ‌ట్టులో రాణించే ఆట‌గాళ్లు ఎవ‌ర‌న్న‌ది ఆంద‌రిలోనూ చ‌ర్చ‌నీయంశంగా మారింది. ప్ర‌పంచ క‌ప్ లో భార‌త జ‌ట్టు ఓపెనింగ్ భాగ‌స్వామ్యం ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టుమ‌ని ప‌ది ప‌రుగులు దాట‌లేదు. తొలి ఒవ‌ర్ లేదా రెండో ఓవ‌ర్ లోనే స్టార్ బ్యాట్స్ మెన్ అభిషేక‌ర్ శ‌ర్మ పెవీలియ‌న్ చేరుకుంటున్నారు. ఆ త‌రువాత కూడా ఒక్కొక్క‌రు ఒక్కో మ్యాచ్ లో రాణిస్తున్నారు. కానీ స‌మిష్టిగా రాణించి మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన మ్యాచ్ లు లీగ్ ద‌శ‌లో క‌నిపించ‌లేదు.

పాకిస్తాన్ తో జ‌రిగిన మ్యాచ్ ఎంతో ఆస‌క్తి రేపినా ఇషాన్ కిష‌న్ స‌త్తా చాట‌డంతో గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరును సాధించ‌గ‌లిగింది. ఆ మ్యాచ్ లో భార‌త బౌల‌ర్లు రాణించి పాక్ ను క‌ట్ట‌డి చేయ‌డంలోఒ విజ‌య‌వంతం అయ్యారు. దీంతో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన ఆ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు దాయాదిపై సులువుగానే విజ‌యం సాధించింది. ప‌సికూన లాంటి నెద‌ర్లాండ్ జ‌ట్టుతో కూడా భార‌త బ్యాట‌ర్లు స‌మ‌ర్ధ‌వంతంగా రాణించలేక‌పోయారు. ఆజ‌ట్టు బౌల‌ర్ల‌ను ఎదుర్కొని ప‌రుగులు రాబ‌ట్టేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లీగ్ ద‌శ‌లో మూడు మ్యాచ్ లు విజ‌యం సాధించినా….జ‌ట్టులో బ్యాటింగ్, బౌలింగ్ స‌మ‌తుల్య‌త‌పై ఎన్నో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

సూప‌ర్ 8 లో భాగంగా భార‌త జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్ ద‌క్షిణాఫ్రికాతో ఆదివారం త‌ల‌ప‌డ‌నుంది. ఆహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగే మ్యాచ్ సూప‌ర్ 8 లో భార‌త్ జ‌ట్టు ఎదుర్కొనే తొలి మ్యాచ్ ఫిబ్రవరి 26వ తేదీన గురువారం జింబాబ్వేతో రెండో మ్యాచ్ ఆడనుంది . ఈ మ్యాచ్ చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జ‌రుగ‌నుంది.మార్చి ఒకటో తేదీన ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ తో చివరి సూపర్ 8 మ్యాచ్ఆ డనుంది. గ‌త‌మూడు మ్యాచ్ లు ప‌రిశీలించిన జ‌ట్టు మేనేజ్ మెంట్ సూప‌ర్ 8 లో ప‌లు మార్పులు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

మూడు మ్యాచ్ ల‌లో పరుగులేమి చేయ‌కుండా ఔటౌన అభిషేక్ శ‌ర్మ ను య‌ధావిధిగా కొన‌సాగిస్తూ….. 3వ స్థానంలో బ్యాటింగ్ కు వ‌చ్చి 20 25 ప‌రుగుల‌కు ప‌రిమితం అవుతున్న తిల‌క్ వ‌ర్మ‌ను త‌ప్పిస్తార‌ని తెలుస్తోంది. వ‌ర్మ స్థానంలో మ‌రోసారి సంజుకు అవ‌కాశం క‌ల్పించే అవ‌కాశాలున్నాయ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.భార‌త్ బ్యాటింగ్ పై కొన‌సాగుతున్న ఆందోళ‌న‌..….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *