‘ఉపఖండం జట్లకు భారీ పరాభవం
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
ప్రపంచ కప్ ఫెవరెట్ జట్లలో ఒకటిగా పేరు వినిపిస్తున్న భారత జట్టు లోటు పాట్లు మరోసారి బట్టబయలయ్యాయి. సౌత్ ఆఫ్రీకాతో జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టు బ్యాటింగ్,బౌలింగ్ లో పూర్తిగా విఫలమైంది. కీలక ఆటగాళ్లు ఏ దశలోనూ మ్యాచ్ గెలిపిస్తామన్న ధీమాతో కనిపించలేదు. ఒకరి తరువాత ఒకరు ఇలా వచ్చి…అలా వెళ్లి పోవడం జట్టు బ్యాటింగ్ బలహీనతలను ఎత్తి చూపింది. భారత జట్టులో నలగురు బ్యాట్సె మెన్లు కలిపి 105 పరుగులు చేయగా….. ఆరు గురు బ్యాటర్లు మొతం కలిపి ఆరు పరగులు సాధించారు. ఇందులో ముగ్గురు బ్యాటర్లు 0 పరుగులకే ఔటయ్యారు. ఇషాన్ కిష్, రింకూసింగ్, జస్ప్రీత్ బూమ్రా లు 0 పరుగులు చేశారు. ఒక్క పరుగు చేసిన వారిలో తిలక్ వర్మ, అర్షదీప్ లు ఒక్కో పరుగు సాధించారు.

భారత జట్టులో శివం దుబే 42 పరుగులు చేశారు. ఇదే భారత జట్టులో అత్యధిక స్కోరు సూర్య,పాండ్యలు 18 పరుగులు చేయగా ప్రపంచ కప్ లో పరుగుల బోణి చేయని అభిషేక్ ఈ మ్యాచ్ లో 15 పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ 11 పరుగులు చేశారు. ఇది భారత బ్యాటింగ్ లైనప్ లోని ఆటగాళ్లు చేసిన స్కోరు. భారీ స్కోరును ఛేధించేందుకు భారత బ్యాటర్లు ఏదశలోనూ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించలేదు. నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్లు అనవసరంగా పారేసుకున్నారు. దీంతో సౌత్ ఆఫ్రీకా విజయం ఎంతో సునాయసంగా మారింది. భారతపై 76 పరుగుల తేడాతో దక్షిణా ఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ల బ్యాటింగ్ మరో సారి స్పిన్ ఉచ్చులో పడి పోయింది. తొలి ఓవర్ స్పిన్ బౌలింగ్ తో మొదలు పెట్టిన కెప్టన్ మార్కరమ్ ఆ ఓవర్ లోనే వికెట్ సాధించి ఆ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. ఆతరువాత ఆ జట్టు సీమర్లు కూడా భారత్ పై వత్తిడి పెంచడంతో భారీ స్కోరు ఛేదనలో ఇండియా చేతులెత్తేసింది.
భారత్ ఇవి సరిచేసుకోకుంటే….అంటే
శ్రీలంక కూడా….…

భారత్, శ్రీలంక లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టీ-20 ప్రంపచ కప్ లో ఒకే రోజు లీగ్ దశలో ఉప ఖండంలోని రెండు జట్లు భారీ ఓటమిని మూట గట్టుకున్నాయి. లీగ్ దశ పూర్తి చేసుకున్న శ్రీలంక, భారత్ లు ప్రత్యర్థుల చేతిలో చిత్తు అయ్యాయి. శ్రీలంకలో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆ జట్టును భారీ తేడాతో ఓడింది. ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 146 పరుగులు చేసింది. 147 పరుగుల విజయ లక్ష్యంగా బరిలో దిగిన లంక ఏదశలోనూ ఆ స్కోరు ఛేధించే విధంగా కనిపించలేదు. ఈ మ్యాచ్ లో శ్రీలంగా 51 పరుగుల తేడాతో ఓటమి మూట కట్టుకుంది. లంక జట్టులో అత్యధిక స్కోరు 30 పరుగులు మెండిస్ మాత్రమే చేశారు. మిగిలిన వారు ఆ మాత్రం కూడా స్కోరు చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ సునాయసంగా శ్రీలంకపై ఇంగ్లాండ్ విజయం దక్కించుకుంది.






Leave a Reply