
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
కీలక మ్యాచ్ లో పసికూనల పై భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. ఇప్పటి వరకు బ్యాటింగ్ లో విఫలమవుతూ వచ్చిన బ్యాటర్లు ఈ మ్యాచ్ ద్వారా ఫాం లోకి వచ్చినట్లు కనిపిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు కూడా ఫలితాన్నిఇచ్చినట్లు కనిపిస్తోంది. చెన్నై మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. భారత్ ఓపెనింగ్ పార్టనర్ షిప్ ఈరోజు మ్యాచ్ లో పర్వాలేదనిపించే విధంగా అనిపించింది. సంజుశాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనింగ్ జోడీగా రంగంలోకి దిగారు. తొలి ఓవర్ నుంచే భారీ టార్గెట్ విధించాలన్న లక్ష్యంగా బ్యాటింగ్ మొదలు పెట్టారు. 3.4 ఓవర్లలో 48 పరుగులు సాధించారు. అక్కడే ఓపెనర్ సంజు ఐటయ్యారు. అభిషేక్ కు ఇషాన్ కిషన్ తోడు కావడంతో భారత బ్యాటింగ్ లో మరింత జోరు చూపింది.

11 ఓవర్ పూర్తయ్యే వరకు భారత జట్టు 120 పరుగులు చేసి ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది. ఇషాన్ 24 బంతుల్లో 38 పరుగులు చేశారు.12.5 ఓవర్లలో 150 పరుగులకు భారత్ స్కోరు చేరుకున్న తరువాత అభిషేక్ కూడా ఔటయ్యారు. ఈ మ్యాచ్ లో అభిషేక్ ప్రపంచకప్ లోనే తొలిసారి 30 బంతులను ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్స్ ల సహాయంతో 55 పరుగులు చేసి ఔటయ్యారు. మరో వైపు సూర్యకుమార్ కూడా కొద్ది సేపే ఉన్నా 3 ఫోర్లు,2 సిక్స్ లతో 13 బంతుల్లో 33 పరుగులు చేసి వెనుదిరిగారు. హర్దికపాండ్య, తిలక్ వర్మలు పోటీ పడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పాండ్య 23 బంతుల్లో2 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 50 పరుగులు చేయగా తిలక్ వర్మ 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్ ల సహాయంతో 44 పరుగుల చేసి నాటౌట్ గా నిలిచారు. జింబాబ్వే విజయం కోసం 257 పరుగులు చేయాల్సి ఉంది.
మరో మ్యాచ్ లో దక్షిణాప్రికా జట్టు వీండీస్ ను చిత్తు చేసింది…



Leave a Reply