
- ముంబాయిలో కేసు నమోదు
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
టీ-20 ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా భారత జట్టు ఆటగాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. ఇందులో వింతేముంది అంతా మామూలే కదా అనే అనుమానం అందరిలో వస్తుంది…కానీ భారత జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఉన్న హార్ధిక్ పాండ్య అత్యుత్సాహం ప్రదర్శించారు. క్రికెట్ జట్టు సహచరులు జాతీయ జెండాలతో సంబరాలు చేసుకుంటే హార్ధిక్ జాతీయ జెండాను భుజాలకు వేసుకుని తన ప్రేయసీ తో చిందులు వేయడం, హద్దలు దాటి వ్యవహరించారు. ఈ దృష్యాలన్నీ లైవ్ లో , ఫోటోలతో సహా వైరల్ అయ్యాయి. దీంతో ఓ న్యాయ వాది హార్ధిక్ పాండ్య జాతీయ జెండాను గౌరవించకుండా వ్యవహరించిన తీరును తప్పుబడుతూ ముంబాయిలో ఫిర్యాదు చేశారు. ఇది జాతీయ జెండాకు చేసిన అవమానంగా ఆ న్యాయవాది పేర్కొంటూ శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో పాండ్యపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన చోట పోలీసులు ఈ సంఘటన అహ్మదాబాద్ లో జరిగిందని ముందుగా ఫిర్యాదు తీసుకునేందుకు ముందుకు రాలేదని, అయితే తాను జాతీయ జెండాకు సంబంధించిన విషయమై దేశంలో ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చని చెప్పడంతో ఫిర్యాదును తీసుకున్నారని ఆ న్యాయవాది వెల్లడించారు. ఇక తదుపరి చర్యలు ఎలా ఉంటాయో అని ఆసక్తిగా ఫిర్యాదు దారు చెప్పారు. హార్ధిక్ పాండ్య వ్యవహారం క్రికెట్ అభిమానులను కూడా ఒకెత్తు చిరాకు తెప్పించింది. తన ప్రేయసీతో మైదానంలో వ్యవహరించిన తీరుపై ఫ్యాన్స్ మండి పడుతున్నారు. జాతీయ జెండాతోనే తన భుజాలపై ఉన్న సమయంలో తన ప్రేయసి తో వ్యవహరించిన తీరు పై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.



Leave a Reply