- అరుణాచలంలో గిరివలయం
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్)
టీ-20 ప్రపంచ కప్ లో విజయం సాధించడంతో భారత క్రికెట్లర్లు వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ లు తమ మొక్కులు తీర్చుకున్నారు. తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువాణ్ణమలై లో గిరి ప్రదక్షణ చేసుకున్నారు. వరణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ లు 14 కిలోమీటర్ల గిరివలయం చేస్తుండడంతో అభిమానులు వారిని కలుసుకునే ప్రయత్నం చేశారు. సాధారణంగా గిరివలయం చేసే భక్తులు చెప్పులేకుండా గిరి ప్రదక్షణ చేయడంగా ఉన్న ఆనవాయితీని ఈ ఇద్దరు క్రికెటర్ల కూడా చెప్పు లు లేకుండానే గిరి ప్రదక్షణ చేశారు. వేసవి కాలం కావడంతో…రాత్రి సమయంలో ఈ ఇద్దరు గిరిప్రదక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Leave a Reply