- ఈ రోజు మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు
ఐపీఎల్- 19 లో మరో హై ఓల్టేజి మ్యాచ్ ఈ రోజు ముంబాయి వాంఖేడే స్టేడియంలో జరుగనుంది. ఐపీఎల్ లో అత్యత్తుమ జట్టుగా చలామణి అవుతున్న ముంబాయి ఇండియన్స్, దూకుడుకు మారుపేరుగా ఉండే కోల్ కొత్తా నైట్ రైడర్స్ ఈ రోజు తలపడనున్నారు. రెండు బలమైన జట్లు పోటీ పడుతుండడం, వాంఖేడే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో…ఈ మ్యాచ్ లో పరుగల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరు జట్లలో కూడా ఆగ్రశ్రేణి ఆటగాళ్లు ప్రాథినిథ్యం వహిస్తుండడంతో మ ఆ్యచ్ పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ముంబాయి ఇండియాన్స్ ఐపీఎల్ లో ఐదు సార్లు విజేతగా నిలుపవడంతో ఈ సారి కూడా ఛాంపియన్ రేస్ లో ఉన్న జట్టుగా కనిపిస్తోంది. ఈ జట్టుకు బౌలింగ్ విభాగంలో ప్రపంచం క్రికెట్ లో నే అత్యుత్తమ బౌలర్ గా గుర్తింపు ఉన్న బూమ్రా ప్రత్యక బలం. డెత్ ఓవర్లలో బూమ్రా యార్కర్లను ఎదుర్కొవడం క్రికెటర్ లకు పరీక్షగా నే నిలుస్తోంది.బ్యాటింగ్లో పవర్ హిట్టర్లు, స్టేబుల్ ప్లేయర్లు కలిసి ఉండటం వల్ల పెద్ద స్కోర్లు సత్తా జట్టుకు ఉంది.
మొదటి మ్యాచ్ లో ఎవరు గెలిచారో తెలుసా……

కోల్ కత్త నైట్ రైట్ రైడర్స్ యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలు సాధిస్తోంది.
బ్యాటింగ్ ఆర్డర్ లో స్ట్రోక్ ప్లేయర్లు ఉండగా, స్పిన్ బౌలింగ్ ఈ జట్టుకు ప్రధాన బలం. మిడిల్ ఓవర్లలో మ్యాచ్ను ప్రభావితం చేయగల ఆటగాళ్లు జట్టు లో ఉండడం కలిసి వచ్చే అంశం.డెత్ ఓవర్లలో బౌలింగ్ ఈ జట్టుకు ప్రధాన సమస్య ఈ సమస్యను అధిగమిస్తే…..జట్టు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.
ఏ జట్టు బలం….

ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎప్పుడూ నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది.. ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్లో బలంగా ఆడుతుంది. వాంఖెడే స్టేడియంలో చిన్న బౌండరీలు ఉండటం వల్ల బ్యాట్స్మెన్కు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది.కోల్కతా జట్టు స్పిన్ బలం ఉన్నా, ముంబై జట్టులో స్పిన్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనే బ్యాట్స్ మెన్లు ఉన్నారు. ఇక్కడ ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు కనీసం 200 స్కోరు చేయగలిగతే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.









Leave a Reply