(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ వినోదాన్ని అందించే ఐపీఎస్-19 సీజన్ ప్రారంభం అయింది. ఇదే సమయంలో దీన్ని ఆసరాగా చేసుకుని ఎంతో మంది అక్రమార్కులు బెట్టింగ్ ఊపులోకి అమాయకులను దింపి బెట్టింగ్ లకు పాల్పడుతుంటారు. ప్రతిఏటా పోలీసుల నిఘాను తప్పించుకుని బెట్టింగ్ లతో కోట్లాదిరూపాలు కొల్లగొడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణా పోలీసులు ఇప్పటి నుంచే అప్రమత్తం చేస్తూ బెట్టింగ్ నిర్వాహకులతో పాటు, ఆన్ లైన్ బెట్టింగ్ వ్యవహారంపై కూడా సీరియస్ గా ఉన్నారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారిపై కూడా ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బెట్టింగ్ యాప్ లతో అప్రమత్తంగా ఉండాలని వీడియో విడుదల చేశారు.
ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.
గతంలో ప్రచారం ద్వారా వందలాది యాప్లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది.
కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.
ఆన్లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్లైన్ బెట్టింగ్లపై మా ప్రత్యేక నిఘా ఉంది.
ఐపీఎల్ లో టికెట్ల పంచాయతీ తెలుసా…..
బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి.









Leave a Reply