(స్పోర్స్ డెస్క్,న్యూస్ఇన్)
ఐపీఎల్ లో హై ఓల్టేజీ మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ముంబాయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. బలమైన జట్లు బరిలో దిగడంతోక్రికెట్ ప్రేమికులు ఆదివారం ఎంతో ఎంజయ్ చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ముంబాయి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముంబాయి బ్యాటర్లలో రూథర్ ఫర్డ్ 31 బంతులు ఎదుర్కొని 71 పరుగులు చేశారు. ఇదే ఆ జట్టులో అత్యధిక స్కోరు

ఈ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన ముంబాయి ఇండియన్స్ ఆర్సీబీకి ధీటుగానే సమాధానం ఇచ్చింది. ముంబాయి ఓపెనింగ్ బ్యాటర్లు రికెల్టన్, రోహిత్ శర్మలు ధాటిగా బ్యాటింగ్ చేశారు 7 ఓవర్లలో 70 కి పైగా పరుగులు రాబట్టారు. కాని రోహిత్ శర్మ రిటైర్ట్ హర్ట్ గా వెనుదిరిగారు. రియాన్ రికెల్టన్ 22 బంతులు ఎదుర్కొని 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 37 పరుగులు చేసి 8వ ఓవర్ తొలి బంతికే ఔటయ్యారు. అదే ఓవర్ లో తిలక్ వర్మ బ్యాటింగ్ వచ్చి వెనుదిరగడంతో ఆర్సీబీ మ్యాచ్ పై పట్టు భిగించింది. ముంబాయి బ్యాటర్లను కట్టడి చేసేందుకు మరింత వ్యూహాత్మకంగా పావులు కదిపింది. హర్ధిక పాండ్య బరిలో దిగి ముంబాయి జట్టు స్కోరు బోర్డును కొద్ది సేపు పరుగులు పెట్టించారు. 22 బంతులు ఎదుర్కొన్న పాండ్య 6 ఫోర్లు, 1 సిక్స్ తో 40 పరుగులు చేసి ఔటయ్యారు. అంతకు ముందుగానే సూర్యకుమార్ యాదవ్ కూడా 22 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతో 33 పరుగులు చేసి ఔటయ్యారు. 72 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఎంఐ15 ఓవర్ల కు మ్యాచ్ వచ్చే సరికి 147 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

మరో వైపు రన్ రేట్ పెరుగుతూ రావడంతో…పరుగులు సాధించే ప్రయత్నం చేసి ముంబాయి బ్యాట్స్ మెన్లు క్రమంగా వెనుదిరిగారు.18 ఓవర్లు పూర్తయ్యే సరికి ఎంఐ విజయానికి58 పరుగుల దూరంలో ఉంది. రెండు ఓవర్లలో దాదాపు 60 పరుగులు చేయాల్సి ఉండడంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు వికెట్లు తీసుకోగా మిగిలిన బౌలర్లు తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. ముంబాయి ఇండియన్స్ జట్టులో రూథర్ ఫర్డ్ అత్యధికంగా 25 బంతుల్లో51 పరుగులు చేశారు.











Leave a Reply